జాతీయ వార్తలు

దమ్ముంటే 15 నిమిషాలు సెక్యూరిటీ లేకుండా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 20: ప్రజలెవరూ గణతంత్ర వేడుకల్లో పాల్గొనవద్దని హెచ్చరిస్తూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఒక వీడియోను విడుదల చేసింది. అంతేకాదు ధైర్యం ఉంటే 15 నిమిషాల పాటు తన సొంత ఇంట్లో కానీ, సొంత ఊరులో కానీ ఎలాంటి భద్రతా లేకుండా ఉండాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఇతర రాజకీయ నాయకులను సవాలు చేసింది. పది నిమిషాలు నిడివి ఉండే ఆ వీడియోలో గుర్తు తెలియని ముజాహిదీన్ కమాండర్ ఒకరు ఎకె-47 రైఫిళ్లను పట్టుకొని ఉన్న ఇద్దరు అనుచరులు పక్కన నిలబడి ఉండగా మాట్లాడాడు. ‘మొసలి కన్నీళ్లు కార్చడం ఆపండని జమ్మూ, కాశ్మీర్ సిఎం మెహబూబాను, ఇతర నాయకులను హెచ్చరిస్తున్నాం.