జాతీయ వార్తలు

మరో కాశ్మీర్‌వర్శిటీలో విద్యార్థుల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 18:దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రీనగర్ నిట్ విద్యార్థుల ఘర్షణల వేడి తగ్గక ముందే కాశ్మీర్‌లోని మరో వర్శిటీలో స్థానికులు, స్థానికేతర విద్యార్థుల మధ్య వివాదం రాజుకుంటోంది. రజౌరీలోని బాబా గులాం షా బాద్‌షా వర్శిటీలో కాశ్మీర్ లోయ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్ధుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయని, ఫలితంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారి విధ్వంస కాండకు దారితీసినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో అనేక వాహనాలూ దగ్ధమైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఇటీవల వరల్డ్ కప్ టి 20లో వెస్టిండీస్ చేతిలో భారత్ పరాజితం కావడం స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే.