జాతీయ వార్తలు

‘అనంత’కు స్వచ్ఛ విద్యాలయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు స్వచ్ఛ విద్యాలయ అవార్డు లభించింది. గురువారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ జిల్లా కలెక్టర్ కోలా శశిధర్ ఈ అవార్డును అందుకున్నారు. సివిల్ సర్వీస్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, దేశంలోని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వౌలిక సదుపాయాలను కల్పించినందుకు ఈ అవార్డు లభించింది.