జాతీయ వార్తలు

మీ తల్లి వాడిన పదాన్ని గుర్తుచేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూతెహ్రి (ఉత్తరాఖండ్), ఫిబ్రవరి 9: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తిప్పికొట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన ఎదురుదాడికి దిగారు. మీ తల్లి సోనియాగాంధీ గతంలో మోదీ గురించి మాట్లాడుతూ ఉపయోగించిన పదాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన రాహుల్‌కు హితవు పలికారు. గురువారం ఇక్కడ నిర్వహించిన ఒక ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ.. మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని అన్నారు. యుపిఎ హయాంలో జరిగిన రూ.12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలకు బాధ్యత వహించవలసింది కాంగ్రెస్ పార్టీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అని ఆయన పేర్కొన్నారు. మోదీ బుధవారం రాజ్యసభలో మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఆయన చుట్టూ అనేక కుంభకోణాలు జరిగాయి. కాని, వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి మచ్చ పడలేదు. బాత్‌రూమ్‌లో రెయిన్‌కోట్ వేసుకొని స్నానం చేసే కళ డాక్టర్ సాబ్‌కు మాత్రమే తెలుసు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను గట్టిగా సమర్థించిన అమిత్ షా, ఇప్పటివరకు బహిరంగ సభలో మాట్లాడేప్పుడు ఉపయోగించే భాష ఆందోళన కలిగించేదిగా ఉందని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మినహాయింపేమీ కాదని అన్నారు. అనేక సంవత్సరాల క్రితం సోనియాగాంధీ.. మోదీ గురించి మాట్లాడుతూ ఉపయోగించిన పదాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన రాహుల్‌కు హితవు పలికారు. అదే పదాన్ని ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు సర్జికల్ స్ట్రైక్‌పై మాట్లాడుతూ ‘ఖూన్ కి దలాల్’ అంటూ ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. సోనియాగాంధీ గతంలో మోదీని ఉద్దేశించి చేసిన ‘వౌత్‌కా సౌదాగర్’ (హత్యల వ్యాపారి) అనే వ్యాఖ్యలను అమిత్ షా పరోక్షంగా గుర్తుచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఆర్డినెన్స్ ప్రతిని బహిరంగంగా చించివేయడం ద్వారా ఆయనను అవమానించిన మొదటి వ్యక్తి రాహుల్ గాంధీయేనని అమిత్ షా అన్నారు. రెండున్నరేళ్లలో ఏం చేశారో చెప్పండంటూ ప్రధాని మోదీని రాహుల్ గాంధీ నిలదీయడాన్ని ఆయన తప్పుపట్టారు. 60ఏళ్ల పాటు ఏం చేశారో చెప్పనివారు మోదీని రిపోర్ట్ కార్డ్ అడుగుతున్నారని ఎదురుదాడికి దిగారు.