జాతీయ వార్తలు

యూపీలో గెలుపు మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌పి, బిఎస్‌పి ప్రతిపక్ష స్థానంకోసం పోటీపడుతున్నాయని మంగళవారం ఇక్కడ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గుజరాత్ గాడిదలంటూ చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుపట్టారు. అఖిలేశ్ వాడిన భాష ప్రజల భాష కాదని ఆయన విమర్శించారు. ‘ఆరు నూరైనా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపికి మంచి మెజారిటీ వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటుచేసి తీరుతుంది’ అని వెంకయ్య జోస్యం చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ రెండూ ప్రతిపక్ష స్థానంకోసం పోటీపడడమే తప్ప ఫలితం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల్లో దేన్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టాలన్నది ప్రజలు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. ఇక్కడి పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి మంత్రి యూపీ సిఎం అఖిలేశ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.