జాతీయ వార్తలు

దీప కొత్త ఫోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 24: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేన కోడలు దీపా జయకుమార్ శుక్రవారం కొత్త రాజకీయ ఫోరం ప్రారంభించారు. తన రాజకీయ ప్రస్థానం మొదలైందని పేర్కొన్న దీప ఈ ఫోరం జెండాను కూడా ఆవిష్కరించారు. ఎంజిఆర్ అమ్మ దీపా ఫోరంగా పేర్కొనే ఈ రాజకీయ వేదిక పతాకంపై ఎంజిఆర్, జయలలిత బొమ్మలు ముద్రించారు. జయలలిత మరణం కారణంగా ఆర్కెనగర్ నియోజకవర్గం ఖాళీ అయిందని అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని దీప వెల్లడించారు. గత కొంత కాలంగా రాజకీయాల్లోకి రావాలంటూ తనకు అభ్యర్థనలు వస్తున్నందునే ఈ ఫోరం ఏర్పాటు చేశానని అన్నారు.

చిత్రం..జయలలిత మేన కోడలు దీపా జయకుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం