జాతీయ వార్తలు
అది రెండు అవినీతి కుటుంబాల మధ్య పొత్తు: షా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 26 February 2017
అంబేద్కర్నగర్ (యూపీ), ఫిబ్రవరి 25: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎన్నికల పొత్తు రెండు అవినీతి కుటుంబాల మధ్య ఒప్పందంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అభివర్ణించారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదని, రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయించేవని శనివారం ఇక్కడ వ్యాఖ్యానించారు. లక్నోకు 240 కిమీ దూరంలో ఉన్న అంబేద్కర్ నగర్ ఎన్నికల సభలో మాట్లాడుతూ బహుజన సమాజ్వాదీ పార్టీ, సమాజ్వాదీ పార్టీలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ దొందూ దొందేనని షా విమర్శించారు.