జాతీయ వార్తలు
ఉపాధి కూలీల వేతనం పెంపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 March 2017
న్యూఢిల్లీ, మార్చి 9: దేశ వ్యాప్తంగా ఉపాధిహామీ పనిదినాలను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం తెలుగుదేశం సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచినట్లు ప్రకటించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో 8లక్షల మంది లబ్ధి పొందనున్నారు. మరోవైపు కూలీలకు ఇచ్చే వేతనాన్ని కూడా రాష్ట్రాలను బట్టి పెంచింది. ఏపి, తెలంగాణల్లో రూ. 3 చొప్పున కూలీ పెరిగింది. ప్రస్తుతం రోజుకు 194రూపాయలు ఇస్తుండగా ఇకపై 197రూపాయలు ఉపాధి కూలీ చెల్లిస్తారు.