జాతీయ వార్తలు

రేపు ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరుకానున్న దినకరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 20: రెండాకుల గుర్తుకోసం ఎన్నికల అధికారికి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ శనివారం ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం రాత్రి దినకరన్‌కు సమన్లు అందజేశారు. అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ నేతృత్వంలో పోలీసు అధికారులు చెన్నై బసంత్ నగర్‌లోని దినకరన్ ఇంటికి వచ్చి సమన్లు అందజేశారు. ఢిల్లీ పోలీసులు కూడా దినకరన్‌పై బుధవారం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దినకరన్ దేశం విడిచి వెళ్లిపోతారన్న కథనాల నేపథ్యంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అన్నాడిఎంకె ఎన్నికల గుర్తు రెండాకులు తమ వర్గానికే చెందేలా చూడాలంటూ ఓ ఎన్నికల అధికారికి లంచం ఇవ్వజూపారన్న కేసులో సుకేష్ చంద్రశేఖర్ అన్న దళారీని ఈ నెల 16న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.