జాతీయ వార్తలు

పేట్రేగిన ఉగ్రవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మే 1: కాశ్మీరులో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుల్గామ్‌లో సోమవారం ఒక బ్యాంకు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడిన ఉగ్రవాదులు అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు బ్యాంకు అధికారులతో పాటు మరో ఐదుగురు పోలీసులను హత్య చేశారు. జమ్మూ-కాశ్మీరు బ్యాంకు వాహనాన్ని అటకాయించిన ఉగ్రవాదులు, అందులోని వారిని బయటికి రావాల్సిందిగా బెదిరించి ఏడుగురిని కాల్చి చంపారని, అనంతరం ఆ వాహనం నుంచి 50 లక్షల నగదును, అలాగే పోలీసుల వద్ద ఉన్న నాలుగు రైఫిళ్లను దోచుకెళ్లారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాశ్మీరులో ఇటువంటి ఘటన జరగడం వారం రోజుల వ్యవధిలో రెండోసారి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైనిక బలగాల కవ్వింపు చర్యల మాటున ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడగా, పాక్ బలగాల కవ్వింపు కాల్పుల్లో ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్లు మృతిచెందారు.
గత వారం కుప్వారా జిల్లాలో సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడిన ఉగ్రవాదులు ఒక యువ కెప్టెన్ సహా ముగ్గురు సైనికుల ప్రాణాలు తీసిన విషయం విదితమే.