జాతీయ వార్తలు

ఒక్క మరక లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 10: దేశంలో బిజెపి మూడేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని, తమది నిజాయితీ గల ప్రభుత్వం అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ‘‘ఇంతకుముందు భూముల స్కాం, బొగ్గు స్కాం, కామన్‌వెల్త్ స్కాం, అంతరిక్ష స్కాంట్లా స్కాంలతోనే ప్రభుత్వం నడిచింది. బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఢిల్లీలో ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను పరిశుభ్రం చేశాం’’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. మోదీ పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఏడు రోజుల ప్రదర్శనను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి రేటు మందగించిందని, అమెరికా ఆర్థిక వృద్ధి రేటు 3శాతమే ఉందని, భారత వృద్ధి రేటు మాత్రం సుమారు 7శాతంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. యుపిఏ హయాంలో విధానాలను దారుణంగా దెబ్బ తీశారని, ప్రస్తుతం దేశానికి చురుకైన నాయకుడు లభించాడని ఆయన అన్నారు. ‘‘మన నాయకుడిని ప్రపంచం ఒక గొప్ప నేతగా గుర్తించింది’’ అని వ్యాఖ్యానించారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాలకు కేంద్ర మంత్రులు, అధికారులు వెళ్లి పరిస్థితులను సమీక్షించటం, ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించటం మోదీ ఆలోచనేనని అన్నారు. టీమ్ ఇండియా అన్నది మోదీ లక్ష్యమని, అన్ని రాష్ట్రాలు, కేంద్రం కలిసి కట్టుగా పని చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. తాను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఇతర రాష్ట్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలు కనుగొనడానికే తాను చెన్నై వచ్చానని తెలిపారు.