జాతీయ వార్తలు

పిఎమ్‌ఓకి చేరిన ఏకీకృత సర్వీసు ఫైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్ ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపించినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ పిఆర్‌టియు నేతలకు తెలిపారు. ఢిల్లీలో కేంద్రం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణలోని ఉపాధ్యాయ సంఘం పిఆర్‌టియు నేతలు జనార్దన్ రెడ్డి, పూల రవీందర్, వి.మోహన్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి సమావేశమయ్యారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకీకృత సర్వీసు రూల్స్ ఫైల్ హోంశాఖ ఆమోదం తెలిపిందని, ఈ ఫైల్‌ను ప్రధాని మంత్రి కార్యాలయానికి పంపించినట్టు హోంశాఖ మంత్రి వెల్లడించినట్టు పిఆర్‌టియు నేతలు తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రెండు రోజుల్లో ఈ ఫైల్ రాష్టప్రతి ఆమోదానికి పంపిస్తామని హోంమంత్రి తెలిపారని టిఆర్‌టియు నేతలు పేర్కొన్నారు.