జాతీయ వార్తలు

కారులో మహిళ గ్యాంగ్ రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురుగావ్, జూన్ 20: కదులుతున్న కారులో ఓ మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ సంఘటన మంగళవారం ఉదయం గురుగావ్‌లోజరిగింది. గత నెల 29 గురుగావ్ మనిసర్ ప్రాంతంలో ఓ మహిళను అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా బాధితురాలి తొమ్మిది నెలల పాపను పాశవికంగా హత్య చేసిన సంఘటన తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే మళ్లీ మరో మహిళపై గ్యాంగ్ రేప్ సంఘన జరిగడం అక్కడి పోలీసులకు సవాలుగా మారింది. రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన మహిళ (35) పదిహేను రోజుల కిందటే గురుగావ్‌లోని సోహనా ప్రాంతంలో నివాసముంటున్న తన కుటుంబ సభ్యుల వద్దకు వచ్చింది. మంగళవారం రాత్రి 8.45 గంటలకు సోహనాకు కారులో వచ్చిన నలుగురు దుండగులు ఆమెను అపహరించారు. ఆతర్వాత దేశ రాజధాని న్యూఢిల్లీ రహదారిపై వెళుతూ మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత గ్రేటర్ నోయిడా శివారు ప్రాంతంలోని చాచా కా రెస్టారెంట్ వద్ద బాధితురాలిని కారు నుంచి బయటకు తోసేసి పరారయ్యారు. జరిగిన సంఘటనను బాధితురాలు స్థానికులకు చెప్పడంతో వారు గౌతమ్‌బుద్ నగర్‌లోని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో పగిలిపోయిన మద్యం సీసాలు లభ్యమయ్యాయని స్థానికులు తెలిపారు. ఈ విషయం పోలీసులకు తెలిపితే తీవ్ర పరిణామాలెదుర్కోవలసి ఉంటుందని నిందితులు హెచ్చరించినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నామని గురుగావ్ పోలీస్ కమిషనర్ సందీప్ కిర్వార్ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరిలించినట్టు చెప్పారు. రహదారిపై నున్న సిసిటివి ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు సందీప్ చెప్పారు.