జాతీయ వార్తలు

ప్రాణం తీసిన సెల్ఫీల మోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, జూలై 10: తామెక్కడున్నామో తెలుసుకోకుండా సెల్ఫీలకోసం పాకులాడాలన్న ఆసక్తి ఏడుగురి ప్రాణాలను బలిగొంది. ఓ రిజర్వాయర్ మధ్యలో బోటు ప్రయాణిస్తుండగా సెల్ఫీలు తీసుకునేందుకు కొందరు పర్యాటకులు చేసిన ప్రయత్నం ఈ దుర్ఘటనకు దారి తీసింది. సెల్ఫీల హడావుడి కారణంగా బోటు బోల్తా పడటంతో ఏడుగురు మునిగిపోయారు. ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మహారాష్ట్ర నాగపూర్ జిల్లాలోని వీనా డ్యామ్‌లో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఏడుగురి మృతదేహాలను వెలికి తీశామని, మునిగిపోయిన వారిలో ఆరుగురి వయస్సు 19 నుంచి 22 సంవత్సరాల మధ్యన ఉంటుందని తెలిపారు.

చిత్రం.. నీటిలో మునిగిపోయన వారి ఆచూకీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనం