జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో పేలిన ప్రెషర్ బాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మే 9: చత్తీస్‌గఢ్‌లో సోమవారం ప్రెషర్ బాంబు పేలిన ఘటనలో కోయ కమాండర్ మృతి చెందాడు. సుక్మా జిల్లా కుంట బ్లాకులోని మారాయిగూడెం పోలీస్ స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. అక్కడకు భద్రతగా జవాన్లు వెళ్లారు. తొలుత 11.30 గంటల సమయంలో ఒక ప్రెషర్ బాంబు పేలింది. తర్వాత 12 గంటల సమయంలో జెసిబి రోడ్డును తవ్వుతున్నప్పుడు మరో బాంబు పేలడంతో పక్కనే ఉన్న కోయ కమాండర్ మడకం జోగా, జెసిబి క్లీనర్ అజయ్ మండాల్ గాయపడ్డారు. వారిని ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మడకం జోగా మృతి చెందాడు. అజయ్ మండాల్‌ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. మరోవైపు బీజాపూర్ జిల్లా ఆవుపల్లి పోలీసులు ఇద్దరు నక్సల్స్‌ను టేక్‌మెట్ల గ్రామ అటవీ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. దేవా, కుంజా జోగ ఇద్దరు మిలీషియా సభ్యులు.