జాతీయ వార్తలు

ఆర్భాటాలు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 13: బయటి ప్రదేశాల్లో పర్యటనకర వెళ్లినప్పుడు తనకోసం ఎసి, కూలర్లు, రెడ్‌కార్పెట్లు, సోఫాలు వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ చేయవద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల జమ్మూ, కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద దాడుల్లో మృతిచెందిన జవాన్ల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లినప్పుడు తనకోసం అధికారులు చేసిన హడావుడి, ప్రత్యేక ఏర్పాట్లు చూసి ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, తక్షణం దీనికి ముగింపు పలకాలని భావించారని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్రంలోని అన్ని జిల్లాల పాలనాధికారులకు, పోలీసు చీఫ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అమర జవాన్ల కుటుంబాలను పరామర్శించడానికి ముఖ్యమంత్రి ఇటీవల దేవోరియా, గోరఖ్‌పూర్‌లను సందర్శించినప్పుడు జిల్లా అధికారులు ఆయనకోసం వారి నివాసాల్లో తాత్కాలికంగా సోఫాలు, ఎర్రతివాచీలు, ఎసిలు లాంటివి ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా మరోసారి ఇలాంటివి జరగరాదని స్పష్టంగా సూచించారని, అందుకే ఈ నెల 10న ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ అధికారి చెప్పారు.