జాతీయ వార్తలు

ప్రణబ్‌కు ప్రధాని విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: రాష్టప్రతి ప్రణ బ్ ముఖర్జీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ హౌస్‌లో శనివా రం వీడ్కోలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్టప్రతి పదవికి కొత్తగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రణబ్ ముఖర్జీకి ఈ సందర్భంగా మెమొంటోను అందించి సత్కరించా రు. ఆ తరువాత అక్కడి సందర్శకుల పుస్తకంలో రాష్టప్రతి తన సందేశాన్ని రాశారు.మంగళవారం 25వ తేదీన రామ్‌నాథ్ కోవింద్ కొత్త రాష్టప్రతిగా ప్రమాణం చేయబోతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. సైనిక దళాలు పూర్తి స్థాయి రిహార్సల్స్ ను కూడా శనివారం నిర్వహించాయి.

చిత్రం.. ఆదివారం పదవీ విరమణ చేయనున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి శనివారం రాత్రి ఢిల్లీలోని హైదరాబాద్ హ స్‌లో విందు ఇచ్చిన సందర్భంగా జ్ఞాపికను అందజేస్తున్న ప్రధాని మోదీ