జాతీయ వార్తలు

రాష్టప్రతిగా నేడు కోవింద్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: భారత 14వ రాష్టప్రతిగా రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె ఎస్ ఖేహర్ ఆయన చేత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మధ్యాహ్నం గం.12.15కు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రభృతులు హాజరవుతారు. కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 21 గన్‌ల సైనిక గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో తొలి ప్రసంగం చేస్తారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీతో కలిసి రాష్టప్రతి భవన్‌కు వెళ్తారు.