జాతీయ వార్తలు

వరద బాధితులను ఆదుకుందాం రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 29: వరదలతో అతలాకుతలం అవుతున్న అస్సాం, గుజరాత్‌లో బాధితులను ఆదుకోడానికి ముందుకు రావాలని బాలీవుడ్ నటుడు అమిర్‌ఖాన్ అభిమానులకు పిలుపునిచ్చాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు సేకరించాలని సోషల్ మీడియా ద్వారా ఖాన్ విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు తన ట్విట్టర్‌లో అభిమానులను ఉద్దేశించి వీడియో సందేశం పోస్టు చేశాడు. ‘గుజరాత్, అస్సాంలలో అనేక ప్రాంతాలు వరద విలయతాండవం చేసింది. అపార నష్టం వాటిల్లింది. ప్రజలు తీవ్రమైన వేదనలో ఉన్నారు. ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేం. కష్టాల్లో ఉన్న మన సోదరులు, సోదరీమణులను ఆదుకుందాం’ అని 52 ఏళ్ల అమీర్ అభిమానులకు పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు సేకరిద్దాం అని ఆయన విజ్ఞప్తి చేశారు. అస్సాంలో వరదలకు 79 మంది మృతి చెందారు. ఆస్తినష్టం అపారంగా ఉంది. గుజరాత్‌లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్రం.. గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షిస్తున్న ఆర్మీ జవాన్లు