జాతీయ వార్తలు
కనీస వేతన చట్టంపై సబ్ కమిటీ: దత్తాత్రేయ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 August 2017
న్యూఢిల్లీ, ఆగస్టు 3: కనీస వేతన చట్టంలో మార్పులకు సంబంధించి కొన్ని అంశాలను అధ్యయనం చేసేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గురువారం బండారు దత్తాత్రేయ అధ్యక్షతన కనీస వేతన సలహా బోర్డు సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కనీస వేతన చట్టం అమలుపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. అలాగే దేశంలో అన్ని రాష్ట్రాలు కచ్చితంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కనీస వేతన చట్టం 1948 అమలులోకి వచ్చిందని,ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టానికి మార్పులు చేసినట్టు వెల్లడించారు.