జాతీయ వార్తలు

అమరనాథ్ యాత్రికులపై దాడి కేసులో ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 6: గత నెల 10న అమరనాథ్ యాత్రికుల బస్సుపై దాడి చేసిన లష్కరే తోయిబా మిలిటెంట్లకు సహాయ పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జమ్మూ, కాశ్మీర్ పోలీసులు ఆదివారం చెప్పారు. ఈ కేసును తాము ఛేదించామని కూడా వారు చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లు కాశ్మీర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ మునీర్ ఖాన్ ధ్రువీకరించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటుగా వాహనాలు సమకూర్చిన ఈ ముగ్గురినీ స్థానిక కోర్టులో హాజరుపరిచారు. లష్కరే తోయిబా మిలిటెంట్ ఇస్మాయిల్ మరో ఇద్దరు మిలిటెంట్లు, కాశ్మీర్‌కు చెందిన స్థానికుడు ఒకరు కలిసి ఈ దాడి చేసినట్లు అనంత్‌నాగ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో మునీర్‌ఖాన్ చెప్పారు. మిగతా ముగ్గురు కుట్రదారులను బిలాల్ అహ్మద్ రెషి, ఐజాజ్ వాగే, జహూర్ అహ్మద్‌లుగా గుర్తించారు. నిందితులు యాత్రికుల వాహనానికి ‘షౌకత్’ అని, సిఆర్‌పిఎఫ్ వాహనానికి ‘బిలాల్’ అనే కోడ్ పదాలు పెట్టుకున్నారని కూడా ఖాన్ వెల్లడించారు.