జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 7: జమ్ము కాశ్మీర్‌లో పాకిస్తాన్ నుంచి భారీ చొరబాటు యత్నాన్ని భద్రతాదళాలు తిప్పికొట్టాయి. మాచిల్ సెక్టార్‌లో సోమవారం పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదులు వాస్తవాధీనరేఖ వెంబడి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. ముందుగా పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రితో చొరబడటానికి ప్రయత్నించారు. వాస్తవాధీన రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గుర్తించిన భద్రతాబలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అనుమానాస్పద ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అయిదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. మిగతా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి పారిపోయారు. ఉత్తర కుప్వారా జిల్లాలోని పాకిస్తాన్ సరిహద్దుల్లో టెర్రరిస్టుల కదలికలపై గట్టి నిఘా పెంచినట్లు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.