జాతీయ వార్తలు

అన్నాడిఎంకె గ్రూపులు త్వరలోనే విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 7: అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు త్వరలోనే విలీనం అవుతాయని తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి సోమవారం ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఏవో చిన్న చిన్న సమస్యల వల్ల విలీనంలో జాప్యం జరుగుతోంది. త్వరలోనే వాటికి తెరపడుతుంది’ అని అన్నాడిఎంకె (అమ్మ) వర్గం నేత వెల్లడించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన పళనిస్వామి విలీనం ఎప్పుడు అన్నదానిపై కచ్చితంగా ప్రకటించలేదు. విలీనానికి సంబంధించి అమ్మవర్గం నుంచి సానుకూలత లేదని పురచ్ఛి తలైవీ అమ్మ వర్గం నేత ఓ పన్నీర్ సెల్వం ప్రకటన నేపథ్యంలో పళనిస్వామి స్పందించారు. అన్నాడిఎంకె వర్గాల విలీనం త్వరలోనే అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే దానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. పార్టీలో తన పట్టుకోసం పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ టిటివి దినకరన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.