జాతీయ వార్తలు

ఢిల్లీలో పది మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రాహీమ్ సింగ్‌ను సిబిఐ కోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం దేశ రాజధానిలో జరిగిన హింసాకాండలో అల్లర్లకు పాల్పడిన పదిమందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతి నగర్‌లో బస్సును తగలబెట్టిన ఘటనలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈశాన్య డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజీత్ కుమార్ సింగ్లా ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ ఈ సంఘటన జరిగిన సమయంలో సేకరించిన సిసిటివి పుటేజ్, సోషల్ మీడియా సహాయంతో నిందితులను గుర్తించినట్టు తెలిపారు. హత్యలకు ప్రయత్నించడం, ప్రజల ఆస్తికి నష్టం కల్గించినందుకుగాను నిందితులపై వివిధ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.