జాతీయ వార్తలు

కాళేశ్వరంపై 6న నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన పిటిషన్ల్‌పై విచారణ జరిపే పరిధి తమకు ఉందా లేదా అన్న దానిపై వచ్చే నెల 6వ తేదీన నిర్ణయిస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యవరణ అనుమతులపై ఎన్జీటీలో హయాతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ విచారించింది. ఈ ప్రాజెక్టుపై ఎన్జీటీ విచారణ జరిపే పరిధిపై ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ, దీనిపై ఒక స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని బెంచ్‌ను కోరారు.