జాతీయ వార్తలు
జవాన్ కిడ్నాప్, హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీనగర్, నవంబర్ 25: దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సెలవుపై ఉన్న ఓ టెరిటోరియల్ ఆర్మీ జవాన్ను మిలిటెంట్లు కిడ్నాప్ చేసి, ఆపై హత్య చేశారు. కీగమ్ ఏరియాలోని వాత్ముల్లాలోని పండ్లతోటలో బుల్లెట్ గాయాలతో పడి ఉన్న జవాన్ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతిచెందిన జవాన్ను ఇర్ఫాన్ అహ్మద్ డర్గా గుర్తించారు. అతడు షోపియాన్ జిల్లా సెంజెన్కు చెందినవాడని అధికారులు వెల్లడించారు. ఇర్ఫాన్ బండిపోర జిల్లా టెరిటోరియల్ ఆర్మీ క్యాంప్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు ఈనెల 26 వరకూ సెలవులో ఉన్నాడని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. మిలిటెంట్లు ఇర్ఫాన్ను కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డర్ హత్యను సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించారు. ఇది పిరికిపందల చర్య అని ఇలాంటి సంఘటనల వల్ల శాంతికి విఘాతం కల్గిస్తామంటే వారి భ్రమేనని మిలిటెంట్లను ఉద్దేశించి అన్నారు.
హత్యకు గురయిన ఇర్ఫాన్ ఫైల్పొటో