జాతీయ వార్తలు
టీడీపీకి సుజనా చౌదరీ భారీ విరాళం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 November 2017
న్యూఢిల్లీ, నవంబర్ 26: తెలుగుదేశం పార్టీకి కేంద్ర మంత్రి సుజనా చౌదరి భారీ విరాళం ప్రకటించారు. ఆ పార్టీ జాతీయ కార్యాలయంలో కార్యకర్తల కోసం ఏర్పాటుచేసిన భోజన సదుపాయాల నిమిత్తం రాజసభ సభ్యుడిగా తాను పొందిన జీతభత్యాల మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్టు సుజనా చౌదరి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు రాజ్యసభ సభ్యుడిగా 90 నెలలుపాటు కొనసాగినా సుజనా చౌదరి, దాదాపు 90 లక్షల రూపాయలు అందుకున్నారు. ఈ మొత్తాన్ని కార్పస్ ఫండ్గా ఏర్పరచి టీడీపీ కార్యాలయంలో భోజన సదుపాయాలు కల్పించేందుకు వినియోగించనున్నట్టు తెలిపారు.