జాతీయ వార్తలు

జార్ఖండ్‌లో బీజేపీ నేత హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుంతి, డిసెంబర్ 2: జార్ఖండ్‌లోని కుంతి జిల్లాలో బిజెపి నాయకుడొకర్ని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపేశారు. ఆయన ఇంటి వెలుపలే శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో బీజేపీ నేత కజిన్, తల్లికి బులెట్ గాయాలయ్యాయని ఎస్పీ అశ్వినీకుమార్ సింగ్ వెల్లడించారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ ఎస్టీ సెల్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భయ్యారాం ముండాను దుండగులు కాల్చి చంపారని ఆయన అన్నారు. హత్యకుగల కారణాలు, ఎవరు ఈ దారుణానికి ఒడిగట్టిందీ తెలియాల్సి ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ‘38ఏళ్ల ముండా హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం’ అని సింగ్ చెప్పారు. సంఘటన జరిగిన బగ్మా గ్రామం, పరిసర ప్రాంతాల్లో సబ్ డివిజనల్ పోలీసు అధికారి రణ్‌వీర్ సింగ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ముండా కజిన్ బిస్రా, తల్లి అగుని దేవీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఎస్పీ స్పష్టం చేశారు. గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వారిద్దరినీ రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్‌కు తరిలిస్తున్నట్టు ఆయన వివరించారు. మామూళ్ల కోసమే తీవ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.