జాతీయ వార్తలు
సూరత్ వద్ద తీరం దాటనున్న ఓఖీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 4 December 2017
విశాఖపట్నం, డిసెంబర్ 3: తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికిస్తున్న ఓకీ తుపాను ఈ నెల అయిదోతేదీన గుజరాత్ రాష్ట్రం సూరత్ వద్ద తీరాన్ని దాటనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం లక్షద్వీప్లోని అమినీ దీవికి 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓకీ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందన్నారు. ఇది క్రమంగా బలహీన పడి తీరాన్ని దాటే సమయంలో వాయుగుండంగా మారుతుందన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.