జాతీయ వార్తలు

‘మందిరం నిర్మిస్తేనే వారి కలలు సాకారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, డిసెంబర్ 4: తమ జీవితాలను త్యాగం చేసిన ‘మందిర యోధుల’ కలలు ఫలించాలంటే అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నేత అంబుజ్ ఓజా అన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసి ఈ నెల 6వ తేదీ నాటికి పాతికేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ నేత ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ నెల 6న అయోధ్య సహా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ‘శౌర్య దివస్’ పేరిట విహెచ్‌పి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా విహెచ్‌పి కో-మీడియా ఇన్‌చార్జి ఓజా మాట్లాడారు.