జాతీయ వార్తలు
మా వ్యవహారాల్లో తల దూరుస్తున్నారు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 December 2017
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం తలదూరుస్తోందని, అక్కడున్న గవర్నర్లకు ఆదేశాలిస్తూ పరోక్ష పాలన సాగించేందుకు ప్రయత్నిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఏమిటని ఆయన నిలదీశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అక్కడున్న గవర్నర్లతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తరచూ వివాదాల్లో మునిగితేలడం తెలిసిందే. ఇదే విధంగా ఆయన గతంలోనూ ఎన్డీయే ప్రభుత్వాన్ని అనేకమార్లు విమర్శించారు.