జాతీయ వార్తలు
బోయలను ఎస్టీల్లో చేర్చవద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడం నిజమైన గిరిజనులకు అన్యాయం చేయాడమేనని ఆదివాసీ అధికార్ మంచ్ (ఏఆర్ఎం) మండిపడింది. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా కారెం శివాజీని ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని మంచ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బోయలను ఎస్టీగా చేర్చడంపై జాతీయ ఎస్టీ కమిషన్కు ఏఆర్ఎం శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఏఆర్ఎం జాతీయ చైర్మన్, మాజీ ఎంపీ మిడియం బాబురావు, ఏపీ గిరిజన సంఘం నాయకుడు ఏ అప్పలనర్సయ్య, తెలంగాణ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం ధర్మానాయక్, గిరిజన నాయకులు ఎం శోభన్లు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. అనంతరం మిడియం బాబురావుమాట్లాడుతూ బోయలు ఎస్టీ జాబితాకి అర్హులు కారని తెలిపారు. కారెం శివాజీ బోయలు ఎస్టీ హోదాకు అర్హులుగా తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు.