జాతీయ వార్తలు

2017లో తెలుగువారి గౌరవం పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 2017 సంవత్సరంలో తెలుగువారి గౌరవం పెరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్ 2018 క్యాలెండర్‌ను ఆయన అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్, ఆంధ్రా భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఆంధ్రా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజపతిరాజు మాట్లాడుతూ తెలుగు వారు ఎక్కడున్నా సంస్కృతీ సంప్రదాయాలను, విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో తెలుగువారి అభివృద్ధికికోసం ఆంధ్రా అసోసియేషన్ ఎంతగానో కృషి చేస్తోందని ఆయన పేరొన్నారు.
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారు మాత్రం ఎక్కడా విడిపోలేదని అన్నారు. భారతదేశానికి తెలుగువారు మార్గదర్శకం కావాలని ఆయన ఆకాంక్షించారు.

చిత్రం..ఢిల్లీలో శనివారం ఆంధ్రా అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు