జాతీయ వార్తలు

తమిళ గవర్నర్‌కు నిరసనల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంజావూర్, జనవరి 2: ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం పెరుగుతోందంటూ డిఎంకె కార్యకర్తలు మంగళవారం ఇక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లజెండాలు ప్రదర్శించి నినాదాలు చేశారు. స్వచ్ఛ్భారత్ అమలుపై సమీక్ష జరిపేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తంజావూర్ వచ్చారు. ఇలాంటి సమీక్షా సమావేశాలు జరపడం ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని డిఎంకె ధ్వజమెత్తింది. అయితే డిఎంకె ఆరోపణలను రాజ్‌భవన్ వర్గాలు ఖండించాయి. కాగా, కోయంబత్తూరు, తిరునల్వేలి, కన్యాకుమారి, కడలూర్ జిల్లాల్లో గతంలో పర్యటించిన ఆయన అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపారు. తన చర్యలను సమర్థించుకున్న గవర్నర్ భన్వారీలాల్, ఇది రాజ్యాంగపరంగా తనకున్న విధుల్లో భాగమేనని గతంలోనే పేర్కొన్నారు.