జాతీయ వార్తలు

ఢిల్లీలో వాక్‌విత్ జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వారికి భరోసా కల్పిచేందుకే ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సంకల్పయాత్ర 1000 కిలోమీటర్లు మైలురాయిని దాటుతున్న సందర్భంగా యాత్రకు సంఘీభావంగా సోమవారం దేశరాజధాని ఢిల్లీలో ‘వాక్‌విత్ జగనన్న’ (జగనన్నతో కలిసి నడుద్దాం) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఎంపీలతోపాటు స్థానికంగా ఉన్న తెలుగువారు, ఆ పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు. ముందుగా ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించిన తరువాత ఏపీ భవన్ నుంచి పండింత్ రవిశంకర్ లైన్ వరకు యాత్ర సాగింది. అనంతరం ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని, అందుకే భారీ సంఖ్యలో జగన్ పాదయాత్రలో పంచుకుంటున్నారని చెప్పారు.

చిత్రం..ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద వాక్ విత్ జగన్ కార్యక్రమం నిర్వహిస్తున్న వైకాపా నేతలు