జాతీయ వార్తలు

మహిళా సాధికారతలో ముందున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: మహిళల సాధికారిత, అభివృద్ధి, సంక్షేమంకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలుచేస్తున్న పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపునేని రాజకుమారి చెప్పారు. మంగళవారం ఏపీ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్, గర్భవతి మహిళల కిట్స్ పథకం, రుణాల మంజూరు మహిళలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. విజ్ఞాన్ భవన్‌లో బుధవారం జరుగుతున్న జాతీయ మహిళా కమిషన్ 25వ వార్షికోత్సవాలకు హాజరయ్యేందుకు రాజకుమారితోపాటు 55 మంది ప్రతినిధుల బృందం ఢిల్లీకి వచ్చింది.
కళలు, సంస్కృతి, క్రీడా రంగాల్లో మహిళలకు రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని రాజకుమారి చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్ మహిళలకు సంబంధించిన వివిధ సమస్యలు, అంశాలపై ఎంతో కష్టపడి పని చేస్తోందని చెప్పారు. 25వ వార్షికోత్సవాలకు తన బృందంతో కలిసి వచ్చిన రాజకుమారిని జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ అభినందించారు.

చిత్రం. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి. చిత్రంలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం, ఏపీ మహిళా కమిషన్ సభ్యులు