జాతీయ వార్తలు
అతిపెద్ద ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 2 February 2018
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనివల్ల 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. వీరందరికీ ఐదు లక్షల రూపాయిల వ్యయం అయ్యే వైద్యాన్ని ఆరోగ్య బీమా కింద ఉచితంగా పొందనుంది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 24 మెడికల్ కాలేజీలను సైతం ఏర్పాటు చేయనుంది. స్వస్థ్భారత్ (ఆరోగ్యకర భారత్) సమృద్ధి భారత్గా మార్చే క్రమంలో దేశ ప్రజల ఆరోగ్యం ప్రధానమని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కింద కేవలం 30వేల మంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. జాతీయ ఆరోగ్యవిధానం అమలుకు 1200 కోట్లు కేటాయించనున్నట్టు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.