జాతీయ వార్తలు

రిబ్బన్ తుంచేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, ఫిబ్రవరి 22: బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషీ ఆగ్రహానుగ్రహాల గురించి, కోపతాపాల గురించి ఇప్పటికే ఎన్నో ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ సీనియర్ నాయకుడిగానే కాకుండా ఎంపీగా కొనసాగుతున్న జోషీకి గురువారం కాన్పూర్‌లో ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. అది ఏ రాజకీయ అంశమో కాదు. ఆయనకు నచ్చనిది అంతకంటే కాదు. జోషీ ఓ సోలార్ లైట్ ప్యానెల్‌ను ప్రారంభించడానికి వచ్చారు. మామూలుగా అయితే ఇలాంటి వాటికి రిబ్బన్ కటింగ్ ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభించడానికి వచ్చిన జోషీకి రిబ్బన్ కట్ చేయడానికి కత్తెర అందుబాటులో లేకపోయింది. దాంతో ఆయన ఆ రిబ్బన్ తెంపేశారు. అంతేకాదు ఓ సీనియర్ అధికారిపై నిప్పులు చెరిగారు. ‘నువ్వేనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది? ఇలాగేనా ఉండాల్సింది?’ అంటూ ఆయనపై జోషీ అరవడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. జోషీ నిప్పులు చెరుగుతున్న సమయంలోనే మళ్లీ ఆ రిబ్బన్‌ను కట్టేసి కత్తెరను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. అది చూసిన జోషీ ‘ఇప్పుడు మళ్లీ రిబ్బన్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పని నేను ముందే చేసేశాను’ అన్నారు. మళ్లీ ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను కట్ చేయకుండానే ఆయన ఆగ్రహంతో వెళ్లిపోయారు.