జాతీయ వార్తలు

మరో రెండు ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 24: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రెండు భారీ రాకెట్ ప్రయోగాలకు సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం మార్చిలో ఒక పిఎస్‌ఎల్‌వి, ఒక జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ రాకెట్ భాగాలకు సంబంధించిన పరికరాలు శనివారం తమిళనాడులోని మహేంద్ర గిరి నుంచి భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో షార్‌కు తీసుకొచ్చారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు మార్చి 24న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరగనుంది. ఇప్పటికే రాకెట్ రెండు దశల అనుసంధాన పనులను కూడా శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. అదే విధంగా మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ద్వారా ఇండియన్ రీజినల్ నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలను ఇస్రో బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. ఇందులో జీశాట్-6ఎ ఉపగ్రహం రూపకల్పన పూర్తయ్యింది. ఈ నెల 27న బెంగళూరు నుంచి షార్‌కు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 12న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ 40 ప్రయోగం విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో శాస్తవ్రేత్తలు ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఒకే మాసంలో రెండు ప్రయోగాలు ఉండడంతో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా ఇస్రో చైర్మన్‌గా డాక్టర్ శివన్ బాధ్యతలు చేపట్టి మొదటి ప్రయోగం కావడంతో విజయవంతం ప్రయోగించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలపరిచేందుకు జీశాట్-6ఏ ఉపగ్రహ ప్రయోగం ఎంతో ఉపయోగపడడమే కాకుండా సమాచార రంగంలో భారత్ మరో ముందడుగుకు చేరుకోనుంది. ఏప్రిల్‌లో చంద్రయాన్-2 కీలక ప్రయోగానికి కూడా ఇస్రో సన్నద్ధమవుతోంది.

చిత్రం..ప్రత్యేక వాహనంలో షార్‌కు భద్రత నడుమ వెళ్తున్న రాకెట్ పరికరాలు