జాతీయ వార్తలు

పుస్తక పఠనంలో గిన్నిస్ సాధించిన గడ్చిరోలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడ్చిరోలి, మార్చి 3: గడ్చిరోలిలో జరిగిన పుస్తక పఠనం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో 7వేల మంది ఈ పుస్తక పఠన కార్యక్రమంలో పాల్గొని గత ఏడాది టర్కీలో సృష్టించిన రికార్డును అధిగమించారని జిల్లా అధికారులు తెలిపారు. గిన్నిస్ బుక్ రికార్డుల సంస్థ ప్రతినిధుల సమక్షంలో ఈ అత్యంత పుస్తక పఠన కార్యక్రమం జరిగిందని, దీనిని పోలీసు అధికారులే నిర్వహించారని తెలిపారు. గత ఏడాది టర్కీలో జరిగిన పుస్తక పఠనం కార్యక్రమంలో 5,754 మంది పాల్గొన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్జిరోలి సృష్టించిన ఈ గిన్నిస్ రికార్డులో అహింసా సందేశంతోపాటు ఈ జిల్లాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరొచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. హింసాకాండకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆస్కారం ఉండకూడదన్న సందేశంతో అహింసే ధ్యేయమన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని గరిష్ఠ స్థాయిలో స్కూలు పిల్లలే ఇందులో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని గడ్జిరోలి ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.