జాతీయ వార్తలు
చర్యలు తీసుకుంటాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 5 March 2018
న్యూఢిల్లీ, మార్చి 4: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను రూ.12,600 కోట్ల మేరకు మోసగించిన వ్యవహారం విదేశాలకు కూడా విస్తరించినట్టు కనిపిస్తుండటంతో అన్ని రకాల అవినీతి కార్యకలాపాలకు సంబంధించి అవసరమైన అన్ని నియంత్రణా చర్యలు తీసుకుంటామని మారిషస్ హామీ ఇచ్చింది. ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ (ఎఫ్ఎస్సీ) ఆఫ్ మారిషస్.. పీఎన్బీ, నీరవ్ మోదీ, మెహుల్ కోక్సిల వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మారిషస్, మారిషస్ రెవెన్యూ అథారిటీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లతో కలిసి పీఎన్బీలో జరిగిన కుంభకోణం వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు మారిషస్ తెలిపింది.