జాతీయ వార్తలు

ఉగ్రవాది సహా నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, మార్చి 4: కశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో, ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మిలిటెంట్‌తో సహా నలుగురు మరణించారు. భద్రతా దళాలకు చెందిన మొబైల్ వెహికిల్ చెక్‌పోస్టు (ఎంవిఈపి), సోపియన్ లోని పోహన్ వద్ద ఒక కారును ఆపాలని కోరింది. కారు ఆగకపోగా అందులోంచి కాల్పులు మొదలయ్యాయి. తక్షణమే భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో, కారులోని ఒక ఉగ్రవాది మరణించినట్టు పోలీసు అధికారి చెప్పారు. ఉగ్రవాది మృతదేహం వద్ద ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా కాల్పుల సంఘటనలో కొద్ది దూరంలో ఉన్న మరో కారులో ముగ్గురు యువకులు మృతి చెందినట్టు గుర్తించారు. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబందాలున్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. అయితే వీరు మరణించిన ఉగ్రవాదికి సహాయకులుగా వచ్చి ఉంటారని, శ్రీనగర్‌లోని రక్షణశాఖ ప్రతినిది కల్నల్ రాజేశ్ కాలియా అనుమానం వ్యక్తం చేశారు.