జాతీయ వార్తలు

రాజస్థాన్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, మార్చి 10: నలభై ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరుగురు దుర్మార్గులు ఆ ఘనకార్యాన్ని సోషల్ మీడియాలో పెట్టి తన పైశాచికత్వాన్ని చాటుకున్నారు. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన బాధితురాలు ఫిర్యాదుతో వెలుగుచూసింది. అత్యాచార ఘటన నెల రోజుల క్రితమే జరిగిందని బరాన్ పోలీసులు వెల్లడించారు. రేప్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేసిన కామాంధులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆరుగురు రేపిస్టులపై ఈ నెల 5న బాధితురాలు ఫిర్యాదు చేసిందని బరాన్ మహిళా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అనీస్ అహ్మద్ చెప్పారు. నిందితులందరిపైనా ఐపీసీ 376 సెక్షన్‌తోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని, ఇప్పటి వరకూ ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని ఆమె తెలిపారు. బాధితురాలు కోటలో రోడ్డుపక్కన ఓ దాబాలో పనిచేస్తోంది. ఆమె ఓ రోజు అత్తవారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా వాళ్ల కుటుంబానికి పరిచయస్తుడే అయిన చేతన్ మీనా (21) ఇంటివద్ద దించుతానని బైక్ ఎక్కించుకున్నాడు. తరువాత సమసాపూర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. చేతన్‌తోపాటు మరో ఐదుగురు ఆమెపై తెగబడ్డారు. అంతేకాకుండా దాన్ని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారని ఎస్సై తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో మిన్నకుండిపోయింది. అయితే వీడియో పరిసర ప్రాంతాల్లోని ఇంటర్నెట్‌లో కనిపించడంతో ధైర్యం కూడగట్టుకుని పోలీసులను ఆశ్రయించింది. బరాన్ డీఎస్సీ నేతృత్వంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.