జాతీయ వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ సభలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పార్లమెంటు ఉభయ సభల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోతుందంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయవలసిందిగా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని జయరాం రమేష్ బుధవారం వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చి ఇప్పటికే నాలుగేళ్లు గడిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నిటినీ పూర్తిచేస్తే ఉభయ సభల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన దానంతటదే తొలగిపోతుందని జయరాం రమేష్ అభిప్రాయపడ్డారు.