జాతీయ వార్తలు

హోదా కోసం కాంగ్రెస్ వౌనదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తానే చాంపియన్ అన్న రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆదివారం ఏపీ కాంగ్రెస్ నాయకులు మహాత్మాగాంధీ రాజ్‌ఘాట్ వద్ద వౌనదీక్ష చేపట్టారు. నాలుగేళ్ల కాలంలో ప్రత్యేకహోదా విషయంలో మాట మార్చిన చంద్రబాబు తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రత్యేక హోదాను కోరుతున్నారని ఆరోపించారు. ప్రజలు చంద్రబాబు మాట వినే పరిస్థితి లేదని, హోదా అమలు చేసేందుకే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అందుకు ప్లీనరీలో తీర్మానం కూడా చేసిందని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోతానన్న భయంతోనే ప్రత్యేక హోదా విషయంలో ఏన్డీయే నుంచి బయటకు వచ్చారని ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు.