జాతీయ వార్తలు

‘రాజీ’ డ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రాజకీయ లబ్ధికోసమే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలకు తెర తీసారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం పార్లమెంట్‌లో ఎంపీ రామ్మోహన్ నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ కేవలం లోక్‌సభ ఎంపీల చేత మాత్రమే రాజీనామాలు చేస్తామంటున్నారని, రాజ్యసభ ఎంపీల చేత ఎందుకు రాజీనామాలు చేయించడం లేదని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రాష్ట్రాన్ని, ప్రజలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని, విజయ సాయిరెడ్డి తమపై ఉన్న కేసుల మాఫీకోసమే ప్రధాన మంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు నిరూపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ పనిచేస్తోందని, ఏపీ హక్కు లు సాధించేవరకు టీడీపీ పోరాటం చేస్తుందని రా మ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. తమ పార్టీ అ ధినేత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అందరి సమక్షంలోనే అన్ని పార్టీల నాయకులను కలిశారని, ఇప్పుడు ఢిల్లీ పర్యటనపై వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
టీడీపీ ఎంపీల నిరసన
ఏపీకి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ప్ల కార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యే క హోదా, విభజన హామీలను అమలు చేసేవరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో నిరసన తెలుపుతున్న శివప్రసాద్ మంగళవారం హరిదాసు వేషంలో కనిపించారు.

చిత్రం..పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నినాదాలిస్తున్న తెలుగుదేశం ఎంపీలు