జాతీయ వార్తలు

అర్థం పర్థం లేని ఆరోపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: వైకాపా పన్నిన రాజకీయ ఉచ్చుల్లో చిక్కుకున్న తెలుగుదేశం తమ పార్టీపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు హరిబాబు, ఎంపీలు గోకరాజు గంగరాజు, జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఈ ముగ్గురూ మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ- వైకాపాకు బీజేపీ చేరువ అవుతోందంటూ తెలుగుదేశం చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తోందంటూ తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. రాష్ట్ర వినజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేశామని వారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలోని అన్ని జిల్లాల్లో ముఖ్యమైన విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పరపతి బాగా తగ్గిపోయింది. చంద్రబాబు ఢిల్లీకి వస్తే ఆయనను కలిసేందుకు ఇతర నాయకులు ఏపీ భవన్‌కు వచ్చేవారు. అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడు చోటామోటా నాయకులను కలుసుకునేందుకు చంద్రబాబు పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందని హరిబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీకి రావటంద్వారా తన రాజకీయ బలహీనతను చాటుకున్నారని వారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోయిన చంద్రబాబు రాష్ట్ర రాజధాని అమరావతిని అవినీతి నిలయంగా మార్చివేశారని ఆరోపించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సీనియర్ నాయకులెవ్వరు కూడా చంద్రబాబుతో పెద్దగా మాట్లాడలేదని, ఆయన ఢిల్లీ పర్యటన విఫలమైందని వారు చెప్పారు.