జాతీయ వార్తలు

2019 ఎన్నికలకు రాచబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 15: వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు మార్గం సుగమం చేశాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇదంతా నరేంద్ర మోదీ సృష్టించిన సునామీ ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. మోదీ పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసమే, ఈ ఎన్నికల ఫలితాల రూపంలో వెలువడిందన్నారు. ప్రధానిపై ప్రజలకున్న విశ్వాసానికి, అమిత్ షా వ్యూహచతురతకు ఈ ఎన్నికలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఎడ్యూరప్పకు, కర్ణాటక ప్రజలకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఇక మే 1న రంగంలోకి దిగిన ప్రధాని, ఒక సునామీనే సృష్టించారు.