జాతీయ వార్తలు

ఉద్యోగుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: ఏడో వేతన సంఘ సిఫార్సులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై 11న చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 70 ఏళ్లలో ఇలాంటి సిఫార్సులు చూడలేదని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తనకు తీవ్ర అన్యాయం చేసిందంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ చెప్పారు. వేతన సంఘం సిఫార్సులు ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం చూపవని ఆయన విమర్శించారు. కాగా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంపారుూస్ 11న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. భారతీయ రైల్వేలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, తంతి తపాలాశాఖ ఉద్యోగుల సంఘాలు సమ్మెలో పాల్గొంటాయి.