జాతీయ వార్తలు

మామధ్య ప్రేమే తప్ప వైరుధ్యాలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 11: ‘కుటుంబంలో కలతలు లేవు. పార్టీలో కుమ్ములాటలూ లేవు. అంతా సంతోషంతో కూడిన వాతావరణమే అలముకుని ఉంది’ అని బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి, ఆమె కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్‌లు స్పష్టం చేశారు. ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ 71వ జన్మదినం సందర్భంగా ఒకే గూటికి చేరిన లాలూ కుటుంబం ఆనందోత్సాహాలతో గడిపారు. లాలూ కుమారులు తేజ్‌ప్రతాప్, తేజస్వి యాదవ్‌ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు అలముకున్నాయంటూ కొద్దిరోజులుగా కథనాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై సోదరులిద్దరూ వివరణ ఇస్తూ ‘మేమిద్దరం కలిసేవున్నాం. మామధ్య లేనిపోని పొరపచ్చాలు సృష్టించకండి’ అంటూ లాలూ బర్త్‌డే సందర్భంగా సోమవారం ప్రకటన చేశారు. లాలూ కుటుంబ తగాదాలపై మీడియాలో కథనాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తుండటంతో వాటికి చెక్ పెట్టేందుకు దశరంత్ మార్గ్‌లోని తేజ్ బంగ్లాలో, తేజస్వి సహా కుటుంబీకులంతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రబ్రీదేవి ‘మా కుటుంబంలోగాని, పార్టీలోగాని ఎలాంటి విభేదాలు, ఇబ్బందులూ లేవు. కుటుంబంలాంటి ఆర్జేడీ పార్టీ హాయిగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, పశు దాణా కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ సీఎం లాలూప్రసాద్, కండిషనల్ బెయిల్‌మీద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో తండ్రి స్థానాన్ని ఆక్రమించేందుకు కుమారులిద్దరూ ఒకరిపై మరొకరు వ్యూహాలు పన్నుకుంటున్నట్టు మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి.

చిత్రం..ఆర్జేడీ చీఫ్ లాలూ 71వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారులు తేజ్‌ప్రతాప్, తేజస్వి యాదవ్